Sabarimala Temple Annual Pilgrimage Attracts Devotees

Sabarimala: మండల మకరవిళక్కు పండగ సీజన్ ప్రారంభమైంది. కేరళ శబరిమల అయ్యప్ప క్షేత్రంలో వార్షిక వేడుకలు మొదలయ్యాయి. 41 రోజుల పాటు సాగే ఈ శబరి మల యాత్రలో భాగంగా అయ్యప్ప దర్శనం కోసం భారీగా జనం చేరుకుంటున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ఆలయాన్ని తెరిచారు. ఈ అయ్యప్ప దర్శనాలకు సంబంధించి ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి (శుక్రవారం) మండల పూజ , మకర జ్యోతి కోసం దర్శనాలు మొదలయ్యాయి. దీంతో శబరిమల క్షేత్రానికి భారీ సంఖ్యలో భక్తులు చేరుకుని అయ్యప్పను దర్శించుకుంటున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకోవడానికి అయ్యప్ప సన్నిధానం, పంబ వద్దకు భారీగా చేరుకుంటున్నారు.

డిసెంబర్ 27 వ తేదీన మండల పూజ జరగనుంది. దీంతో నేటి నుంచి ప్రత్యేక పూజలు, నిత్యం నెయ్యితో అభిషేకం నిర్వహించనున్నారు. డిసెంబర్ 31 నుంచి వచ్చే ఏడాది జనవరి 15 వ తేదీ వరకు మకర జ్యోతి పూజలు జరగనున్నాయి. ఇక మకర సంక్రాంతి రోజున జనవరి 15 వ తేదీ సాయంత్రం 6.30 గంటలకు మకర జ్యోతి దర్శనం ఉండనుంది.

మరోవైపు.. శబరిమల ఆలయం తెరుచుకోవడంతో అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. సన్నిధానంలో ఉన్న భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు నిలక్కల్, పంబా వద్ద భక్తులకు వీడియో స్క్రీన్‌లతో కూడిన డైనమిక్ క్యూ కంట్రోల్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ సీజన్‌లో శబరిమల వద్ద 6 దశల్లో 13 వేల మంది పోలీసులను మోహరించారు. ఇక వృద్ధులు, చిన్నారులకు అయ్యప్ప దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేశారు.

మండ‌ల దీక్ష కోసం అయ్యప్ప ఆల‌యాన్ని 60 రోజుల పాటు తెరిచి ఉంచ‌నున్నారు. డిసెంబ‌ర్ 27 వ తేదీన మండల దీక్ష సీజ‌న్ ముగియనుంది. మ‌క‌ర సంక్రమ‌ణ పండుగ కోసం డిసెంబ‌ర్ 30 వ తేదీన మ‌ళ్లీ శబరిమల ఆల‌యాన్ని తెరవనున్నారు. జ‌న‌వ‌రి 15 వ తేదీన మకర సంక్రాంతి సందర్భంగా మకర జ్యోతిని దర్శించుకునేందుకు లక్షల సంఖ్యలో భ‌క్తులు శబరిమలకు చేరుకుని అయ్యప్పను ద‌ర్శనం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే భక్తులకు శబరిమల క్షేత్రంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీని ఉపయోగించి ఏర్పాట్లు చేసినట్లు కేరళ దేవాదాయ శాఖ మంత్రి కే రాధాకృష్ణ వెల్లడించారు.

Sabarimala: శబరిమల అయ్యప్ప దర్శనాలకు ఏర్పాట్లు పూర్తి.. యాత్ర ఎప్పటినుంచంటే?
Ayodhya: అధికారంలోకి వస్తే ఫ్రీగా అయోధ్య దర్శనం.. బీజేపీ ప్రకటన

Read More Latest National News And Telugu News

Source link

Related Articles

Latest Updates